విజయనగరం మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు
జనం న్యూస్ 19 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం మహిళా పోలీసు స్టేషనులో 2023 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు
విజయనగరం పట్టణం, కొత్తపేటకు చెందిన దశమంతుల లక్ష్మణరావు (22సం.లు)కు విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే. నాగమణి గారు ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.1000/- లు జరిమానా విధిస్తూ ఆగష్టు 18న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు.
విజయనగరం పట్టణం కొత్తపేటకు చెందిన దశమంతుల లక్ష్మణరావు అనే వ్యక్తి 2023 సంవత్సరంలో
పట్టణానికి చెందిన ఒక మైనరు బాలికను వెంటపడుతూ నమ్మించి పెండ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు, లైంగిక
నేరానికి పాల్పడ్డాడని విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ కె.టి.ఆర్ లక్ష్మి కేసు నమోదు చేసారన్నారు. ఈ కేసులో అప్పటి డిఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, న్యాయస్ధానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. అనంతరం ఈ కేసులో విజయనగరం మహిళా పోలీసు డిఎస్పీ
ఆర్.గోవిందరావు సకాలంలో సాక్షులను, ఆధారాలను న్యాయ స్థానంలో ప్రవేశపెట్టగా, ఫిర్యాదిని నిందితుడు పెండ్లి చేసుకుంటానని నమ్మించి, మోసగించినట్లుగా రుజువు కావడంతో స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి
గారు నిందితుడు దశమంతుల లక్ష్మణరావుకు ఒక సంవత్సరం కారాగారం మరియు రూ.1000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు. ఈ కేసులో బాధితురాలికి రూ.25 వేలును పరిహారంగా మంజూరు చేస్తూ పోక్సో కోర్టు
న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున పబ్లిక్
ప్రాసిక్యూటరు మెట్ట ఖజానారావు వాదనలు వినిపించగా, కేసును అప్పటి డిఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు దర్యాప్తు చేయగా, కోర్టు కానిస్టేబుల్ జి.సూరపు నాయుడు, సి.ఎం.ఎస్. హెడ్ కానిస్టేబులు సిహెచ్. రామకృష్ణ సాకులను సకాలంలో కోర్టులో హాజరుపర్చారని మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు.


