Listen to this article

జనం న్యూస్ఆగస్టు 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన

బిజెపి తాళ్ళరేవు అధ్యక్షులు నిమ్మకాయల ఈశ్వరరావు ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు శోభాయాత్ర కార్యక్రమం నిమిత్తం తాళ్ళరేవు మండల ఇంచార్జి గా బిజెపి ట్రెజరర్ గ్రంధి నానాజీ పాల్గొని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వారి జిల్లా పర్యటన జిల్లాల పర్యటన లో భాగంగా ఈ నెల 25 వ తేదీ సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటించనున్నారు. రాష్ట్ర అధ్యక్షులు హోదాలో మొదటి సారి వస్తున్న సందర్బంగా జరిగే చాయ్ పే చర్చ కార్యక్రమం, శోభా యాత్ర లో బిజెపి నాయకులు, కార్యకర్తలు, బిజెపి అభిమానులు తో పెద్ద ఎత్తున పార్టీ జండా లతో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసి భారతీయ జనతా పార్టీ బలాన్ని చూపించాలని దీనికోసం శక్తి కేంద్ర ప్రముఖ్ లు, బూత్ కన్వీనర్ లు భాద్యత తీసుకొని ఇప్పటినుంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని గ్రంధి నానాజీ మాట్లాడారు, ఈ కార్యక్రమం లో బిజెపి ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొల్లకోట వెంకటరెడ్డి బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చెక్క అజయ్ వర్మ కోనసీమ జిల్లా సెక్రెటరీ కొప్పిశెట్టి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు