

జనం న్యూస్ 28 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో గత ఏడాది సైబర్ కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడికి JFCM కోర్టు మెజిస్ట్రేట్ ఈనెల 31 వరకు రిమాండ్ విధించిందని CI శ్రీనివాసరావు తెలిపారు. నగరానికి చెందిన శ్రీనివాస్(బాధితుడు) నుంచి ప్రకాశం జిల్లాకు చెందిన నిందితుడు శ్రీనివాసులు లోను పేరిట ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.22లక్షలు కాజేశాడని బాధితుడి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టామన్నారు.