Listen to this article

– 62 శాతం లావాదేవీలు వాటిలోనే

– నేరాలకు బ్యాంకు ఖాతాలే కీలకం

– కరెంట్‌ ఖాతాల జారీలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం

– అవినీతి అధికారులపై చర్యలకు రంగం సిద్ధం.

దోచేస్తున్న సొమ్ము బదిలీకి (Cyber ​​criminals)కు బ్యాంకు ఖాతాలు కీలకంగా మారాయి. వారు ఎక్కువగా ప్రైవేటు బ్యాంకులకు చెందిన ఖాతాలనే వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. 62 శాతం లావాదేవీలు వాటిలోనే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బ్యాంకర్లపై కూడా నిఘా పెట్టారు. ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని నగర సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

హైదరాబాద్‌ సిటీ: సైబర్‌ నేరగాళ్లు కాజేసిన డబ్బును పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, సౌకర్యం ఉన్నచోట విత్‌డ్రా చేసుకుంటున్నారు. లేదంటే ఆన్‌లైన్‌లో కూపన్ల కొనుగోలు, లేదా క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు పంపుతున్నారు. దీంతో సైబర్‌ నేరగాళ్ల(Cyber ​​criminals)కు బ్యాంకు ఖాతాల అవసరం పెరిగింది. ఈ అవకాశాన్ని బ్యాంకింగ్‌ రంగంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి సైబర్‌ నేరగాళ్లతో కుమ్మక్కవుతున్నారు. నిబంధనలకు పాతరేసి నకిలీ పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు సహకరిస్తున్నారు.