Listen to this article

మద్నూర్ ఆగస్టు 30 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలో తడి హిప్పర్గ, గోజెగావ్, సొనల గ్రామాలలో వరుసగా కురిసిన వర్షానికి నీట మునిగిన పంటలను మండల వ్యవసాయ అధికారి పరిశీలించడం జరిగింది.
వర్షానికి దెబ్బతిన్న పంటలను గ్రామల వారిగా సర్వే చేసి పై అధికారులకు నివేదిక సమర్పిస్తామని మండల వ్యవసాయ అధికారి తెలపడం జరిగినది. అలాగే మండలంలో దాదాపు 2600వరకు సోయాబీన్, పత్తి, పెసర, మినుము పంటలు వర్షానికి దెబ్బ తిన్నట్టు గుర్తించడం జరిగింది. రైతుల వారిగా ఆయా గ్రామాల ఏఈవోల వద్ద నష్టపోయిన రైతులు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరడమైనది, ఏఈవో లు గ్రామాల వారిగా రైతుల వారిగా నష్టపోయిన రైతుల పంటలను సర్వే చేసి పై అధికారులకు సమర్పిస్తామని తెలియజేయడం జరిగింది.అలాగే ప్రస్తుతం నీటికి గురైన కంది పంటలో ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం నివారణకు మెటలాక్సిల్ 2గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్క మోడళ్ళ దగ్గర పోయాలి.అలాగే పత్తి పంటలో వేరు కుళ్లు తెగులు నివారణకు కాపర్ అక్సిలోరైడ్ 3గ్రాము లీటర్ నీటిలో కలిపి మొక్క మోడళ్ళ చుట్టూ పోయాలి.
మల్టీ కే (13 _0-45) నీటిలో కరిగే ఎరువు 5 – 10 గ్రామాలు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఈ కార్యక్రమంలో ఏఈ వో లు సరోజ, గజనన్ మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.