Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 06:

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల పరిషత్ కార్యాలయం మరియు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఈ రోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల జాబితాలు మరియు పోలింగ్ స్టేషన్ల వివరాలు పబ్లికేషన్ చేయబడ్డాయి.ఎంపీటీసీ ఓటర్ల జాబితా లేదా పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లపై ఎవరైనా అభ్యంతరాలు ఉంటే, అవి తప్పనిసరిగా సెప్టెంబర్ 8, 2025 సాయంత్రం 5 గంటలలోపు మండల పరిషత్ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి తెలిపారు.