Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

గ్రామానికి చెందిన మామిడి సదాశివ, సదానందం శ్రీదేవి ముగ్గురు కలిసి వారి అవసరాల నిమిత్తం వారికి ఉండబడిన ఇంటిని అమ్ముటకు నిర్ణయించుకొని దాని యొక్క విలువను 41,25,000 లకు గాను ధర నిర్ణయించుకొనగా అదే గ్రామానికి చెందిన బాల్నే తిలక్ బాబు భయనగా 15 లక్షల రూపాయలు పెద్దల సమక్షంలో ఇచ్చి మిగతా డబ్బులు రిస్ట్రేషన్ సమయంలో ఇచ్చుటకు అగ్రిమెంట్ చేసుకొని, రిజిస్టేషన్ చెయ్యకుండా బయనంగా ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసినారు అని అట్టి బాధతో బాల్నే తిలక్ బాబు గుండెపోటు తో మరణించాడు అని అయినా కూడా సదురు నిందితులు భయానా డబ్బులు ఇవ్వడంలేదు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసినారు అని బాల్నే తిలక్ బాబు భార్య బాల్నే కవిత పిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుల మూడు నెలల నుండి పారరిలో వున్నారని ఈరోజు నిందితురాలు మామిడి శ్రీదేవి వల్ల ఇంటికి వచ్చినది అని సమాచారం రాగానే పోలోసులు మామిడి శ్రీదేవిని అదుపులోకి తీసుకొని రిమాండ్ నిమిత్తం పరకాల కోర్టులో హాజరు పరచినట్లు . ఇంకా ఇద్దరి నీదితులు పారారిలో ఉన్నారని ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలియజేశారు…..