జనం న్యూస్ అక్టోబర్ 01 సంగారెడ్డి జిల్లా,
పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని మదర్ మేరీ ఓల్డ్ ఏజ్ హోంలో దశాబ్దకాలంగా నివసిస్తున్న ఆర్యవైశ్య వృద్ధుడు శివ మంగళవారం రాత్రి కన్నుమూశారు. శివ అంత్యక్రియలను ఎంఢిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ మరియు అధ్యక్షులు మధు స్వయంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఢిఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు మధు మాట్లాడుతూ “ఇప్పటి వరకు 683 పైగా అనాథలకు గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించగలిగాం. ఎంఢిఆర్ ఫౌండేషన్ ఉన్నంతవరకు ఎవరు ఒంటరిగా, అనాథగా చనిపోరాదు అనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నాం. ప్రతి ఒక్కరి జీవితానికి విలువ ఉంది. వృద్ధులు, అనాథలు చివరి శ్వాస విడిచిన తర్వాత కూడా గౌరవంతో వీడ్కోలు ఇవ్వడం మా బాధ్యత” అని పేర్కొన్నారు.అలాగే ఫౌండేషన్ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న మాదిరి పృథ్వీరాజ్ మరియు ఆయన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.


