Press నోట్: 08/10/2025 జనం న్యూస్ హయత్ నగర్ ఆలంపల్లి దుర్గేష్
దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయిపై సనాతన ధర్మం ముసుగులో జరిగిన మనువాద దాడిని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ దాడి దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక చీకటి రోజు భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థ స్వతంత్రత లౌకిక ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగానే పార్టీ భావిస్తుంది ఈ దేశంలో దళితులకు అత్యున్నత పదవులు దక్కుతున్నప్పటికీ ఆధిపత్య కులాల నుండి అవమానాలు మాత్రం తప్పడం లేదు దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే జస్టిస్ బి.ఆర్.గవాయిపై జరిగిన దాడి ఈ దేశంలో వేల ఏళ్లుగా అవమానాలకు గురవుతున్న జాతులకు ఆత్మగౌరవం దక్కాలంటే రాజ్యాధికారం దక్కాలి రాజ్యాధికారం దక్కనంతకాలం మన జాతులకు అవమానాలు అణిచివేతలు దాడులు తప్పవు ఈ దేశంలో రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ,మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులు ఎంతటి ఉన్నత స్థాయి పదవులు అనుభవించిన సరే వాళ్ళకు ఆత్మగౌరవం రక్షణ రెండూ ఉండవు


