జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జోగిపేట్ మున్సిపల్ 10-10-2025
జోగిపేట్ పట్టణ పరిధిలో గల ఎన్టీఆర్ స్టేడియంలో బి ఆర్ ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రికెట్ ఉత్సవాలు ఈనెల 9 తొమ్మిదో తేదీ నుండి 16వ తేదీ వరకు ఏర్పాటు చేయగా విజేతలకు మొదటి బహుమతిగా 10,000 వేలు, రెండో బహుమతిగా 5000 ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా AMC చైర్మన్ మల్లికార్జున్ గుప్తా, మహేష్ యాదవ్, సాయికుమార్ మరియు ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు క్రికెట్ క్రీడలో పాల్గొన్న వారికి జెర్సీలను కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిన్నా విజయ్ కుమార్ మాట్లాడుతూ యువత క్రీడలలో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, మెరుగుపరచడమే కాక ఒత్తిడిని తగ్గించడం మరియు రోగ నిరోధక శక్తిని పెంచడం వారి యొక్క నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి కాక మీద స్ఫూర్తిని సంపాదించే ఆనందాన్ని కలిగించడం శారీరక సామర్థ్యాలను మెరుగుపరుస్తూ అనేక ప్రయోజనాలకు ఆట పోటీలు అనేవి ప్రేరేపించడం జరుగుతుందన్నారు.


