

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం
స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను గెలిపించాలి
ఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.ఆదివారం గుడిపల్లి మండలం గణపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తోటకూరి పరమేష్, కటికనేని మాధవ రావు, కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, కస్తూరి యాదగిరి, అదంకి దానబాబు, మైనం లింగయ్య, నాయిని రాఘవేంద్ర రావు,తోపాటు 150కుటుంబాలు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన నాయకులకు గులాబీ కండువాలను కప్పి మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను గెలిపించాలి ఆయన కోరారు.బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలు యావత్ దేశానికి దిక్సూచిగా మారాయని అన్నారు. కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు అయిందన్నారు.బీఆర్ఎస్ లో చేరిన ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వం పొంది మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తున్నామని అన్నారు. సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం,డంపింగ్ యార్డు, రైతు వేదికలను కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసిందని అన్నారు. కేసీఆర్ దూరదృష్టి ఫలితంగా గ్రామాల్లో అడుగంటిన చెరువులన్నీ ప్రస్తుతం జలకళతో దర్శనమిస్తున్నాయని అన్నారు. అనేక మారుమూల గ్రామాల్లోనూ ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందుతున్నదని అన్నారు. రైతులకు పంట పెట్టుబడిసాయం చేయాలనే ధృఢ సంకల్పంతో రైతు బంధు, రైతు బీమా వంటి చారిత్రాత్మక పథకాలను కేసీఆర్ రూపకల్పన చేశారని అన్నారు. ఈ రెండు పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 మేనమామ కట్నంగా కేసీఆర్ సర్కార్ అందజేసిందని చెప్పారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యంగులు, వృద్ధులకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ అందజేసిందని అన్నారు. దశాబ్దాల భూవివాధాలను తెరదించి భూయజమానులకు హక్కులు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ధరణీ పోర్టల్ ను రూపొందించిందని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్ధిక భరోసా కల్పించిందని అన్నారు. దేవరకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశామని అన్నారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుంచి కూడా బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెల్లుగూరి వల్లపు రెడ్డి, మునగాల అంజి రెడ్డి,అర్వపల్లి నర్సింహ, నిమ్మల విష్ణువర్ధన్ రెడ్డి,మద సుధాకర్ గౌడ్,బొడ్డుపల్లి మహేందర్,రైనబోయిన శ్రీను,దూదిపాల విష్ణువర్ధన్ రెడ్డి,గోలి గిరి,ఎర్ర యాదగిరి, సత్తయ్య, రాంబాబు,లాజర్,అనిల్, వంశీ తదితరులు అన్నారు.