

జనం న్యూస్ 30 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :- రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు అంజి ,,ఉపాధ్యక్షుడు KNR నరసింహ..ప్రధాన కార్యదర్శిలు..SVR రాజు యాదవ్ స్వామి నాయుడు..జోగులాంబ గద్వాల జిల్లా:గద్వాల రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు (అంజి). ఈ సందర్భంగా అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ..మహాత్ముని ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని, గాంధీజీ చూపిన అహింసా మార్గంలో అందరూ నడవాలని అన్నారు..ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం సభ్యులు ఏజెంట్లు ఎర్రమట్టి వీధి రాజు, నాగరాజు, తెలంగాణ నాగరాజు, నరేష్, విజయభాస్కర్, గోపాల్, నరేందర్ రెడ్డి, అంజి, రఘు తదితరులు పాల్గొన్నారు.