జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
10 ఏళ్లుగా బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని డిసెంబర్31 లోగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. కేంద్రం రూపొందించిన మీ డబ్బు-మీ హక్కు గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలో అన్ని బ్యాంకుల్లో రూ.52.35 కోట్ల రిటైల్ డిపాజిట్లు, రూ. 7.19 కోట్ల సంస్థాగత డిపాజిట్లు, రూ. 9.99 కోట్ల ప్రభుత్వ డిపాజిట్లు క్లెయిమ్ చేయని డిపాజిట్లుగా ఉన్నాయన్నారు.


