Listen to this article

జనంన్యూస్. 07.నిజామాబాదు.ప్రతినిధి.

ఈనెల తొమ్మిదో తారీఖు తెలంగాణ రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర తైక్వాండో పోటీలకు నిజామాబాద్ అమెచ్యూర్ అసోసియేషన్ టైక్వాండో క్రీడాకారులు అండర్ 14 ఏజ్ గ్రూప్ మరియు సీనియర్ టైక్వాండో క్రీడాకారులు పోటీలకు ఎంపికయ్యారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమేజింగ్ టైక్వాండో ప్రెసిడెంట్ బసవ శ్రీనివాస్ హాజరై కొన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులు అందరికి పోటీలలో బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయికి ఎంపికవ్వాలని నిజామాబాద్ కి మంచి పేరు తీసుకురావాలని తల్లిదండ్రులకు గురువుకి అందరికీ మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.