Listen to this article

(జనం న్యూస్ 8నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి)

భీమారం మండలం, ఎన్ని అవరోధాలు ఎదురైనా తాను ఎంచుకున్న లక్ష్యం కోసం జెడ్పిటిసి స్థాయి నుండి సీఎం పీఠాన్ని అధిరోహించిన లక్ష్యసాదకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ మండల నాయకులు కొక్కుల నరేష్ అన్నారు. శనివారం సీఎం జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలోని ట్రాలీ యూనియన్ వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదినం వేడుకలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతిపక్షాలు ప్రభుత్వం కూలిపోవాలని ఎన్ని కుట్రలు చేసినా, సీనియర్ లు అయిన తన సహచర మంత్రులకు స్వేచ్చనిచ్చి, సమన్వయం చేసుకుంటూ రెండేళ్లుగా పాలన కొనసాగిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్న రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఏకకాలంలో 2 వేల కోట్ల రుణమాఫీ చేశారని, వరి వేస్తే ఉరే… అన్న గత ప్రభుత్వ ప్రకటనలను పక్కనపెట్టి, వరి పండించిన రైతులకు 500 బోనస్ తో సహా చెల్లించిన ఘనత కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. క్రమక్రమంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్రానికి మరో 10 ఏళ్లు సేవలందించాలని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవిడపు రమేష్, ట్రాలీ యూనియన్ అధ్యక్షులు దాసరి సంపత్ జంగంపల్లి రాజబాపు పిట్టల లక్ష్మీనారాయణ సిగ్యం మధుకర్ తోట శ్రీరాములు మంచాల కృష్ణమూర్తి శంకర్ గౌడ్ కామెర జనార్దన్ మారం మధుకర్ పందుల మధు తదితరులు పాల్గొన్నారు