Listen to this article

జనం న్యూస్ నవంబర్ 10 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక మండల సమైక్య సమావేశానికి ఓరుగల్లు మహా సమాఖ్య నుండి సీనియర్ సిఆర్పిలు ఎండి షాహిన్, సరిత లు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో మండల సమాఖ్య సమావేశం నిర్వహణ మరియు ఇతర అంశాలపై సభ్య సంఘాల సభ్యులకి సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో వీరితోపాటు ఏపీఎం గౌరీ శంకర్ సీసీలు వెంకటలక్ష్మి శ్రీ కాంత్ పురుషోత్తం లక్ష్మణ్ అకౌంటెంట్ మానస మండల సమాఖ్య అధ్యక్షురాలు మమత కార్యదర్శి మాధురి కోశాధికారి అంజలి, గ్రామ సంఘాల అధ్యక్షురాళ్ళు పాల్గొన్నారు.