Listen to this article

జనం న్యూస్ 11 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని విజయనగరం నగర పాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య కోరారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ గా ఎన్నికైన శివప్రసాద్ ను, విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన నరసింగరావును, యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంఎస్ ఎన్ రాజు ను సోమవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ యూనియన్ నాయకులు అంకితభావంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకోరావాలని కోరారు