జనం న్యూస్ 13 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామం లో రోడ్డుపైకి వచ్చి సంచరిస్తున్న 3 మొసళ్ళు.భయాందోళనలో కాలనీవాసులు.అటవీ శాఖ అధికారులు స్పందించాలని వేడుకోలు.ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో మొసళ్ళు కలకలం రేపింది. నిత్యం రోడ్లపైకి రావడంతో అటుగా వెళ్ళే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎస్సీ కాలనీ అంచన ఉన్న కుంటలో గత సంవత్సర క్రితం ఒక ముసలి చొరబడగా ఇప్పుడు దానితోపాటు మరో రెండు మొసళ్ళు తీవ్రంగా సంచరిస్తూ ఒడ్డుకు వస్తుండడంతో అటుగా వెళ్ళే ప్రజలు కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహిళలు,పురుషులు బహిర్భూమికి వెళ్ళే దారిలో మొసళ్ళు సంచరిస్తుండడంతో తీవ్ర కలకలం రేపింది. సోమవారం రోజున 6అడుగులకు పైగా ఉన్న మొసలి చేపను పట్టిన దృశ్యాలు అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది.వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించాలని కాలనీవాసులు కోరుతున్నారు.



