

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

గాంధీనగర్ లోని కర్మెల్ చర్చ్ వెనుక ఉన్నటువంటి ఖాళీ స్థలంలో చీకటి పడితే చాలు మందుబాబులకు అడ్డగా మారింది.చుట్టుపక్కల జనసంద్రం లేని కారణంగా ఎక్కువ శాతం మద్యం సేవించేవారు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ మద్యం సేవించి ఖాళీ బాటిళ్లను సైతం అక్కడే పగల కొట్టి వెళుతున్నారు.ఎక్కడ చూసినా చుట్టుపక్క పరిసరాలలో వాటర్ ప్యాకెట్లు మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి.ఇది ఇలా ఉండగా అదే దారిలో స్కూలుకు వెళ్లే పిల్లలకు ఇబ్బందికరంగా మారింది. తెల్లవారుజామునే స్కూలుకు వెళ్లే పిల్లలు మందుబాబులు మద్యం సేవించి పగలకొట్టిన బాటిల్లను వారి చేతులు మీదుగా తీసి పక్కన పడేసి స్కూలుకు వెళ్లాల్సివస్తుంది. ఇప్పటికైనా అధికారుల స్పందించి ఇకమీదట ఇటువంటి జరగకుండా చూసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.