Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి మండలం మూలపేటలో శ్రీ శ్రీ శ్రీ గంగాలమ్మా జాతర మహోత్సవం సందర్బంగా అనకాపల్లి జిల్లా వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.//