

జనం న్యూస్ ఫిబ్రవరి 15; జమ్మికుంట కుమార్ యాదవ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వనున్నదా లేదా? అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భుత్వాన్ని నిలదీశారు.శనివారం వీణవంకలోని తన స్వగృహంలో కళ్యాణ లక్ష్మి దరఖాస్తులపై సంతకాలు చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం మాత్రమే ఇప్పటికీ అమలవుతుందని స్పష్టం చేశారు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా తులం బంగారం రాలేదు” అని ఎమ్మెల్యే మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటి వరకు 1,000కి పైగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశానని కానీ ప్రభుత్వ హామీగా వచ్చిన తులం బంగారం మాత్రం ఎవరికి రాలేదని విమర్శించారు.తక్షణమే తులం బంగారం పంపిణీ చేయాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎంతమంది వివాహాలు జరిగాయో వారి అందరికీ తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జమ్మికుంట పట్టణం ,జమ్మికుంట రూరల్, ఇల్లంతకుంట వీణవంకకు సంబంధించిన 300కి పైగా కళ్యాణ లక్ష్మి దరఖాస్తులపై సంతకాలు చేసినట్లు లిపారు.ప్రభుత్వం ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తుంది, అని తులం బంగారం హామీ అమలు చేయకపోతే ప్రభుత్వం బహిరంగ వివరణ ఇవ్వాలి.అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.