Listen to this article

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోస్టర్ల విడుదల జనం న్యూస్ పిబ్రవరి 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యని మండలం లోని సుంగాపూర్ గ్రామంలో సిపిఐ ఎం.ఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా బండారి తిరుపతి,సిపిఐ ఎం.ఎల్న్య డెమోక్రసీ జిల్లా నాయకులు, జగజంపుల తిరుపతి పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే వందరోజుల లోఅమలు చేస్తామని ప్రకటించింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి14 నెలలైనా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది రైతు భరోసా 15000 ఎకరాకు, మహిళలకుమహాలక్ష్మి పథకం క్రింద ప్రతి మహిళకు నెలకు2500, వృద్ధాప్య పింఛన్ 4000, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు, కొత్తగా పెళ్లి అయిన వధూ,వరులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు తో పాటు తులం బంగారం లాంటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఈ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు ఈ హామీల అమలు కొరకు సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఈ కార్యక్రమం కు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై నిరసన తెలిపి అధికార కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు జాడి విలాస్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యకర్తలు దుర్గం చంద్రయ్య, జగజంపుల రాందాస్, దుర్గం ప్రవీణ్, రాంటెంకి రమేష్, జగజంపుల విజయ్, శ్రీకాంత్, గౌతమి, పల్లవి* తదితరులు పాల్గొన్నారు.