

జనం న్యూస్ //ఫిబ్రవరి //16//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన ఐయిత రాజ్యలక్ష్మి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు. నినాదం దినపత్రిక హుజురాబాద్ ఆర్ సి ఇంచార్జ్ రాధాకృష్ణ తల్లి రాజ్యలక్ష్మి ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా, వారి నివాసానికి వెళ్లి రాజ్యలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో,ప్రణవ్ బాబు తో పాటు కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రాచపల్లి సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.