Listen to this article

మ‌ద్యం మ‌త్తులో.. భార్య‌ను గొడ్డ‌లితో న‌రికి చంపిన భ‌ర్త

జనం న్యూస్,ఫిబ్రవరి 20,కంగ్టి మండల ప్రతినిధి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తుర్కవడగామ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి భర్త గుండప్ప భార్య చంద్రమ్మ (45) అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన సంఘటన చోటు చేసుకుంది.ఈ విషయం గురువారం తెల్లవారుజామున ఇరుగుపొరుగువారికి తెలియడంతో వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గుండప్పను అదుపులోకి తీసుకున్నారు.గతకొన్ని సంవత్సరాల నుంచి వీరిద్దరి మధ్య తరుచుగొడవలు జరిగేవని గ్రామస్తులు తెలుపుతున్నారు. కంగ్టి ఎస్ఐ విజయ్‌ కుమార్‌,తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కవడగామ గ్రామానికి చెందిన చంద్రమ్మ (45) కూలి పనిచేసి కాలం వెల్లదీస్తుంది.బుధవారం అర్ధరాత్రి భర్త గుండప్ప మద్యం సేవించి వచ్చి భార్య చంద్రమ్మతో గొడవ పెట్టుకున్నాడు. మాటమాట పెరగడంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య చంద్రమ్మను అతికిరాతకంగా నరికి చంపాడు.చంద్రమ్మ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నారాయణఖేడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. గుండప్పపై కేసునమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.మృతురాలికి ఇద్దరు కూతుళ్లు,ఇద్దరు కొడుకులు ఉన్నారు.