

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి
జనం న్యూస్ 25 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెళ్ళ శంకర్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు లో మార్చి 8న జరిగే జాతీయ అదాలత్ లో ఎక్కువ కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి మంగళవారం ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో జరిగిన సమీక్ష సమావేశంలో తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు తమ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తెలిపారు. మోటార్ వాహన ప్రమాద బాదితుల కేసులలో కక్షిదారులకు న్యాయం జరగాలని సూచించారు. లోక్ అదాలత్ లో రాజీపడటం వలన కక్షిదారులకు సమయము,డబ్బు వృధా కాజాలదని తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీ వారిగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, మనోవర్తి, మోటార్ వాహన ప్రమాద కేసులు మరియు బ్యాంకు కేసులను పరిష్కరించుకొనుట కొరకు కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో కొత్తగూడెం మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఏ.నీరజ, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎ. సుచరిత కొత్తగూడెం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్కినేని సత్యనారాయణ, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, ఇన్సూరెన్స్ కంపెనీకు సంబంధించి సీనియర్ న్యాయవాదులు గాదే రామచంద్ర రెడ్డి, రావి విజయ్ కుమార్, ఏ. రాంప్రసాదరావు, వి.నాగిరెడ్డి, అంబటి రమేష్, రాజమల్లు, పాల్గొన్నారు.