Listen to this article

జనం న్యూస్ జనవరి 11 గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రుద్దీన్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం నార్సింపల్లి గ్రామపంచాయతీ బాలన్న గారి పల్లి చెందిన సమాజ సేవకుడు మాజీ అగ్రి అడ్వైజరీ కమిటీ చైర్మన్ పోతుల రామకృష్ణారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా కమిటీ ట్రెజరర్ కోశాధికారిగా నియామకం అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆశీస్సులతో నాపై నమ్మకం ఉంచి నాకుఈ పదవి బాధ్యతలు అప్పగించినందుకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరియు మాజీ మంత్రి పెనుగొండ నియోజకవర్గం సమన్వయకర్త ఉషశ్రీ చరణ్ కి రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డికి చరణ్ రెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు అందరి సహకారంతోవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తాననివైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ట్రెజరర్ (కోశాధికారి) పోతుల రామకృష్ణారెడ్డి తెలిపారు