తెలంగాణ

రైతు వేదికలో విత్తన మేళ

రైతు వేదికలో విత్తన మేళ

జనం న్యూస్ 23జూన్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు పెగడపల్లి రైతు వేదికలో రేపటి నుండి ఒక వారం పాటు సీడ్ మేళా నిర్వహించబడును.ఈ కార్యక్రమంలో ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్న వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచబడును. అదనంగా నానో ఎరువులు కూడా అందుబాటులో ఉంటాయి. అన్ని ఎరువులు మరియు విత్తనాల డీలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులను పొందవలసిందిగా మండల వ్యవసాయఅధికారి తెలిపారు.

ఇ-పేపర్