

జనం న్యూస్,ఫిబ్రవరి17, అచ్యుతాపురం మండలం లోని వెదురువాడ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఆర్డిఎస్ఎస్ కొత్త లైన్ విద్యుత్ పనుల కారణంగా వెదురువాడ,జి ధర్మవరం, ఎల్ ధర్మవరం, ఎం ధర్మవరం, మోసయ్య పేట బర్మా కాలనీ ఏరియా,అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీ, ఆర్అండ్ఆర్ కాలనీ,దిబ్బపాలెం, వెంకటాపురం సెంటర్, మార్టూరు రోడ్డు, అచ్యుతాపురం సెంటర్ ,సాయి ప్రియా లే అవుట్ ప్రాంతాల్లో 18వ తేదీ అనగా మంగళవారం ఉదయం10 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ ఎం శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు