మాజీముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వవర్ధంతిసందర్బంగా ఘన నివాళి
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా (సెప్టెంబర్ 2)నందలూరు మండల కేంద్రంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన నందలూరు మండల ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన మొట్టమొదటి వ్యక్తి, రైతులకు ఉచిత కరెంట్, ప్రతి పంటకు నీరు అందేలా యుద్ధ ప్రాతి పదికన ప్రాజెక్టులు నిర్మించడానికి జలయజ్ఞం,నిరుపేద విద్యార్థు లకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం, పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ,104,108 ముస్లిం మైనారిటీలకు 4% ప్రత్యేక రిజర్వేషన్ కల్పించిన ప్రజా నాయకుడు, ఇలాంటి మరెన్నో,బృహత్కరమైన పథకాలను ప్రవేశపెట్టిన మహానుభావుడు,మన కడప జిల్లావాసి అయినటు వంటి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఐదు సంవత్సరాలపాటు రాష్ట్రానికిముఖ్యమంత్రిగా పనిచేసి, నేడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకొనివిజయకేతనం ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోబ్బిళ్ళ త్రినాధ్ యాదవ్, కోప్షన్ సభ్యులు కలీముల్లా ఖాన్, ఎంపిటిసి లు పొత్తపి చంద్ర, సోమిశెట్టి ప్రభాకర్,జిల్లా అధికార ప్రతినిధి గుండు మల్లికార్జున రెడ్డి, వాలంటీర్స్ విభాగం నియోజకవర్గం అధ్యక్షులు భాస్కర్ యాదవ్, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పునగాని గుణ యాదవ్ ,ఆకేపాటి జగదీశ్వర్ రెడ్డి, పార్టీ మండల ఉపాధ్య క్షుడు షేక్ షావల్లి, ఇబ్బు, పాటూరు మోహన్ రెడ్డి, పాటూరు నరసింహ రెడ్డి, గుండు గోపాల్ రెడ్డి, పల్లె గ్రీష్మంత్ రెడ్డి, ముమ్మడి శెట్టిసుధాకర్,మంచా మురహరి , విజేయుడు, హస్తవరం సుబ్బారామిరెడ్డి, నల్లతిమ్మయపల్లి నరసారెడ్డి, మధురాజు, అరిగేల నాని, కాకి చంద్ర, నాగసుబ్బయ్య, దివాకర్ రెడ్డి, ఆనాల మధు యాదవ్, పుట్టా శంకర, సుబ్బరాజు, యముక దుర్గయ్య, పనతల గంగయ్య, కోర్లకుంట సుధాకర్, ఆంజనేయులు, గోల్డ్ మస్తాన్, పొత్తపి విజయ్ కుమార్, మోడపోతులసుధాకర్, సురేంద్ర బాబు,చింతకాయలపల్లిశంకర,అఖిల్,నవీన్,నాగివెంకటసుబ్బయ్య, లేబాక వెంకటరమణ రెడ్డి, ఆడపూరు శ్రీనివాసరాజు, సుబ్రహ్మణ్యం రెడ్డి, బొక్కే మణి, మహిళా నాయకురాలు వాణి, లక్ష్మీదేవి, అమ్మి, దేవి తది తరులు పాల్గొన్నారు.