
జనం న్యూస్ 22 -07-2026 జహీరాబాద్ మండలం ఆనెగుంట గ్రామ. సర్పంచ్ పొగాకు నరేష్ కుమార్ కు జిల్లా పంచాయితీ అధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారుగతంలో పని చేసిన సిసి రోడ్డు పెండింగ్ బిల్లుల గురించి జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ జిల్లా కలెక్టర్ గారికి డిపిఓ , డిఎల్పిఓ,ఎంపీడీఓ , ఎంపీఓ గార్లకు పలు మార్లు పిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన అధికారులు 2023-2024 వ ఆర్థిక సంవత్సరంలో GPDP ప్రణాళిక కింద చేపట్టిన సిసి రోడ్డు పనులకు సంబంధించిన రూ .773604/- రూపాయలు (ఏడు లక్షల డెబ్భై మూడు వేయిల ఆరు వందల నాలుగు మాత్రమే ) బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు విచారణ లో తేలినట్లు పనులు పూర్తయినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరపడానికి గ్రామ సర్పంచ్ చర్యలు తీసుకోలేదని సర్పంచుపై ఎందుకు చర్యలు తీసుకొనరాదో 7 రోజులలో మీ యొక్క సంజాయిషీని డిపిఓ కార్యాలయంలో సమర్పించాలని లేఖలో పేర్కొన్నారు