
జనం న్యూస్ జులై 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి: కొల్లూరు: కొల్లూరు పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన చింతల సైదిరెడ్డిని జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సురేష్ శాసనాల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ చింతల సైదిరెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొల్లూరు పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందించేలా ఆయన సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు.అనంతరం సురేష్ శాసనాల మాట్లాడుతూ, ప్రజలకు మరియు పోలీసు శాఖకు మధ్య వారధిగా మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ, మీడియా పరస్పర సహకారంతో పనిచేస్తే సమాజానికి మరింత మేలు జరుగుతుందని అన్నారు.సీఐ చింతల సైదిరెడ్డి మాట్లాడుతూ, పోలీసు-మీడియా సమన్వయం ప్రజలకు పారదర్శకమైన సమాచారాన్ని చేరవేయడంలో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. చట్టబద్ధంగా, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విధులు నిర్వర్తిస్తామని తెలిపారు.