శ్రీ మత్చగిరి స్వామి దేవస్థానం లో గురు పౌర్ణమి వేడుకలు
జనం న్యూస్ జులై 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గల సాయిబాబా మందిరంలో బుధవారం గురుపౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. కార్యక్రమం వివరాలు ఉదయం 5 గంటలకి కాకర హారతి ఉదయం 6 నుండి 9 గంటల వరకు అభిషేకాలు అర్చనలు మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి సాయంత్రం 6 గంటలకు దువ హారతి రాత్రి 8 గంటలకు తేజ్ ఆరతి ఉంటుందని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని చైర్మన్ సామల బిక్షపతి తెలియజేశారు…..