డిగ్రీ ప్రవేశాలకు మరో ఆవకాశం. కళాశాల ప్రిన్సిపాల్ కే అశోక్
బిచ్కుంద జూలై 17 జనం న్యూస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), బిచ్కుందలో 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులలో ప్రవేశాలు పొందదలచిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్ (Degree Online Services Telangana – DOST) ద్వారా ప్రత్యేక అవకాశం కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కె. అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోని అర్హత కలిగిన విద్యార్థుల కోసం దోస్త్ స్పెషల్ ఫేజ్ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు 20-07-2026 నుండి 26-07-2026 తేదీల మధ్య దోస్త్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.