తర్లుపాడు మండల మైనార్టీ సెల్ చైర్మన్గా సయ్యద్ రహంతుల్లా నియామకం
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే 16 తర్లుపాడుమండల మైనార్టీ డిపార్ట్మెంట్ సెల్ చైర్మన్ గా తుమ్మల చెరువు గ్రామనికి చెందిన సయ్యద్ రహంతుల్లానినియమించారుఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి మార్కాపురంలో నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా డా. షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, మైనార్టీల సంక్షేమానికి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. సయ్యద్ రహమతుల్లా కి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.