అమలాపురం లో ఆహ్లాద కరంగా హోటల్ బార్కస్…

May 29, 2026 | వైరల్ వార్తలు

ప్రారంభోత్సవ వేడుకలో మెట్ల రమణబాబు

జనం న్యూస్ మే 29 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) అమలాపురానికి బ్రాండ్ వేల్యూ నిలబెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మెట్ల రమణబాబుఅన్నారు. స్థానిక మహిపాల వీధిలో నూతనంగా బ్రాండ్ వాల్యూ కలిగిన బార్కస్ హోటల్ ను ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. సువిశాలంగా ఫ్యామిలీ రెస్టారెంట్ ఎంతో అందంగా ఉందని, ఆహ్లాదంగా అద్భుతమైన రుచులు గల వంటగాలు అరగించే విధంగా టోటల్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఆయన అన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ చిక్కాల గణేష్, బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు దేవస్థానం చైర్మన్ కంచిపల్లి అబ్బులు, ఛాంబర్ అధ్యక్షులు బోనం సత్తిబాబు, అల్లాడ శరత్ బాబు, మండేల బాబీ, ఆశెట్టి ఆదిబాబు, మాజీ కౌన్సిలర్ పిండి అమరావతి, చిక్కాల ముద్దుబాబు, పిండి రాజా, పెద్దిరెడ్డి నాయుడు, యాళ్ల భాస్కరరావు, తిక్కిరెడ్డి వాసు, చింతలపూడి సత్తిబాబు, శరవణ సాయి సురేష్, కొమ్ముల సురేష్, గంధం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper