దేశచరిత్రలో భారత ప్రజాస్వామ్యానికి చీకటి అధ్యాయం..
జనం న్యూస్ జూన్ 25 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 51ఏళ్లు పాలూరి సత్యానందం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుదేశచరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం నేడు రాజ్యాంగ హాత్యాదినం భావప్రకటనా స్వేచ్చపై జరిగిన ప్రత్యక్ష దాడని ఎమర్జన్సీని వ్యతిరేకించి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించిన మహనీయులందరకీ నివాళులు అర్పించారు రాజ్యాంగంపై దాడి జరిగితే ప్రజలు మౌనంగా ఉండరని అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శిస్తారనే దానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యవసర పరిస్దితి అంటూ అప్పటి ప్రదానమంత్రి శ్రీమతి ఇంధిరాగాంధీ 1975నుండి 1977వరకు 21నెలలపాటు అంతర్గత బాహ్య ముప్పులను ఉటంకిస్తూ భారతదేశమంతా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ఎన్నికలను రద్దుచేయడానికి అక్రమంగా పౌరస్వేచ్చలనునిలిపివేసి, రాజకీయ ప్రత్యర్ధులను, అమాయకులను జైలుపాలు చేసి.పత్రికా స్వేచ్చపై సెన్సార్ విధించబడ్డాదన్నారు. ఆనాటి ఎమర్జెన్సీ 2024 నుండి భారతప్రభుత్వం వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటూ సంవిదాన్ హత్య దివాస్ గా అదికారికంగా ప్రకటించిందన్నారు.