రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్ గా అవార్డు అందుకున్న నాగార్జునసాగర్ బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ – రవికుమార్

September 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్- సెప్టెంబర్ 6- నాగార్జునసాగర్ టౌన్-విద్యా బోధన లో విశేష సేవలు అందిస్తూ పాఠశాలను ప్రగతి పదంలో నడిపిస్తున్న నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రవికుమార్ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డును అందుకున్నారు, శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొడంగల్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకుల విద్యాలయ విభాగం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పదిమంది ఉత్తమ ఉపాధ్యాయులు (ప్రిన్సిపల్) గా ఎంపిక కాగా వారిలో నుంచి నాగార్జునసాగర్ బీసీ గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్ రవికుమార్ అవార్డుని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రానా, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి సైదులు చేతుల మీదుగా అవార్డుని అందుకున్నారు. గత కొంతకాలంగా గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచటమే లక్ష్యంగా వారికి న్యాయమైన విద్య క్రమశిక్షణ క్రీడలు పోటీ పరీక్షలలో శిక్షణ అందించడంలో రవికుమార్ కీలక పాత్ర పోషించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆయన చేసిన కృషికి గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. ప్రిన్సిపల్ రవికుమార్ కు రాష్ట్రస్థాయి అవార్డు రావడం పట్ల ఆర్ సి ఓ స్వప్న, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అవార్డును అందుకున్న ప్రిన్సిపల్ రవికుమార్ మాట్లాడుతూ ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది అని ఇది తన ఒక్కడి కృషి కాదు అని పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల సహకారం వల్లే సాధ్యమైందని అన్నారు రాబోయే రోజుల్లో నాగార్జునసాగర్ జ్యోతిబాపూలే గురుకుల విద్యార్థులను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు, ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper