సోయాబీన్ పత్తి పెసర పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

August 14, 2026 | వైరల్ వార్తలు

మద్నూర్ ఆగస్టు 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కోడిచిర గ్రామంలో సాగు చేస్తున్న సోయాబీన్,పెసర మరియు పత్తి పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు తెలియజేశారు.రైతులుసోయాబీన్ పంటలో :పచ్చ పురుగు మరియు కాండం తొలుచు ఈగ గమనించడం జరిగింది
నివారణకు :Emamectin Benzoate ఎకరానికి 100 గ్రాములు పిచికారీ చేయాలి.తీవ్ర స్థాయిలో పురుగు ఉధృతి ఉంటే Flubendiamide ఎకరానికి 100 గ్రాములు + 13:0:45 ఎకరానికి పిచికారి చేసుకోవాలి.పత్తి పంటలో ఆకు మచ్చ తెగులు కోసం Mancozeb + Carbendazim (Saaf) ఎకరానికి 400 గ్రాములు లేదా Propiconazole (Tilt) 200 మి.లీ. ను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలని సూచించారు.కంది పంటలోఎండు తెగులునియంత్రణకు Copper Oxychloride (COC) లీటరు నీటికి 3 గ్రాములు, అంటే ఎకరానికి 600 గ్రాములు + 13:0:45 ఎకరానికి 1 కిలో పిచికారీ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈవో రాజహిత, రైతులు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper