కొత్త పాసుబుక్ వచ్చినవాళ్లు రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఏవో లావణ్య.
జనం న్యూస్ జూన్ 27, వికారాబాద్ జిల్లా పూడూరు మండల రైతులకు తెలియచేయినది జూన్ 15, 2026 వరకు భూమి పట్టా అయిన పట్టదారులు జూలై 04, 2026 లోపు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోగలరు. ఇంతకుముందు రైతు భరోసా వచ్చే రైతులు అప్లికేషన్ చేసుకోవలసిన అవసరం లేదు రాని వాళ్ళు మాత్రమే చేసుకోవాలని ఏవో లావణ్య తెలిపారు.అందుకు గానూ పట్టదారులు తమ భూమి పాసు పుస్తకం, జిరాక్స్, పట్టాదారు ఆధార్ జిరాక్స్, పట్టదారు బ్యాంకు పాసు పుస్తకం జిరాక్స్,మరియు దరఖాస్తు ఫారం నింపి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి ఇవ్వగలరని తెలిపారు.