తెలంగాణలో పెరుగనున్న ఆటో చార్జీలు
జనం న్యూస్ 05 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలో ఆటోఛార్జీలను పెంచా లని అధికారుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రతిపాదిత రేట్ల ప్రకారం మొదటి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30గానూ ఆ తర్వాత ప్రతి కిలో మీటర్కు రూ.14 గానూ నిర్ణయించిం ది. అలాగే నిమిషాని కి 75 పైసల వెయి టింగ్ ఛార్జీ రాత్రివేళ ప్రయాణానికి సాధారణ ఛార్జీపై 50 శాతం అదనపు ఛార్జీ సర్ ఛార్జ్ ని విధించా లని కమిటీ సూచించింది.ఈ సిఫార్సులతో కూడిన నివేదికను రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె.ఇలంబర్తి ఇటీవల ప్రభుత్వానికి సమ ర్పించారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన తర్వాత ఛార్జీల పెంపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధా రిత యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ 14 డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 7 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 23న జరిగిన సమావేశంలో 15 రోజుల్లోగా ప్రతిపా దనలు సమర్పిస్తా మని అధికారులు హామీ ఇవ్వడంతో వారు సమ్మె పిలుపు ను ఉపసంహరిం చుకున్నారు.ఈ నేపథ్యంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేష్ రెడ్డి ఎంవీఐ శ్రీనివాస్, ఏఎంవీఐలతో కూడిన బృందం తమ నివే దికను సమర్పించే ముందు కేరళ, దిల్లీ, కర్ణాటక బెంగళూరు, మహారాష్ట్ర ముంబ యి ల్లోని ఆటో ఛార్జీల విధానాలను అధ్యయనం చేసింది.12 ఏళ్లుగా ఛార్జీలు పెంచలేదు ఇంధన ధరలు బీమా ఇతర నిర్వహణ ఖర్చుల వంటి వ్యయాల ఆధారంగానే ఛార్జీల పెంపు సిఫార్సు చేసినట్లు నివేదికలో కమిటీ పేర్కొంది. వాహన ధర రూ.2. 55 లక్షలు బ్యాంక్ రుణ సదుపాయం 70 శాతం డ్రైవర్ నెలవారీ జీతం రూ.25 వేలు సగటు న రోజువారీ ప్రయాణ దూరం 163.8 కి.మీ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఆదాయాన్ని ఆర్జించే ప్రతి కిలోమీటర్కు నిర్వహణ వ్యయం రూ.13.53గా ఉంది. దీనివల్ల కిలోమీటర్ కు రూ.14 ఛార్జీని సిఫార్సు చేశారు. గత 12 ఏళ్లుగా ఆటో ఛార్జీలలో ఎలాంటి మార్పు లేదని, ఇప్పుడు వాటిని పెంచాల్సిన అవసరం ఉందని అధికారుల కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.