విజయం మాదే అంటున్న వెస్ట్బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
జనం న్యూస్: పశ్చిమబెంగాల్లో ఈసారి అధికారంలోకి వచ్చేది బీజేపీ అంటూజోరుగా ప్రచారం జరుగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం బీజేపీకి అనుకూలం అని తేలిపోయింది.ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో బీజేపీలో సంబరాలు నెలకొన్నాయి. అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై స్పందించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ తృణమూల్ పార్టీ 200 సీట్లకుపైగా గెలుచుకోవడం ఖాయం అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.శనివారం వర్చువల్గా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి దీదీ ప్రసంగించారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి స్టాక్ మార్కెట్ను తారుమారు చేసే ప్రయత్నం తప్ప మరేమి కాదని ఆమె చెప్పుకొచ్చారు.2021, 2024లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలాగే వేశాయని… ఇప్పుడు మళ్లీ అదే ప్రయత్నం చేస్తున్నారని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. బీజేపీ దౌర్జన్యాలకు పాల్పడింది: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ దౌర్జన్యాలకు పాల్పడింది అని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో తమ పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.అయినప్పటకీ తమ పార్టీ కార్యకర్తలు ధీటుగా ఆ దౌర్జన్యాలను ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న పార్టీ కార్యకర్తలకు భవిష్యత్లో తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో శ్రమించిన పార్టీ కార్యకర్తలకు దీదీ ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమబెంగాల్ ఎన్నికలపై విడుదలైన పలు ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికర అంచనాలను వెల్లడించాయి.అత్యధిక సర్వేలు బీజేపీకి అనుకూలంగా తమ అంచనాలు వెల్లడించాయి. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం 294 స్థానాలున్న పశ్చిమ బంగాల్ అసెంబ్లీలో బీజేపీ 150 నుంచి 160 స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించే అవకాశం ఉందని పేర్కొంది.ఇకపోతే టీఎంసీకి 100 నుంచి 111 స్థానాలు వస్తాయని… అలాగే ఇతరులకు ఆరు నుంచి 10 సీట్లు మాత్రమే గెలుచుకుంటారని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.