తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా గద్వాల పట్టణ కేంద్రంలో డికె. బంగ్లా లో జాతీయ జెండా ను ఆవిష్కరించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు..
జనం న్యూస్ 02 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారులు అమరవీరులన్నాయని వారి త్యాగాల ఫలితమే తెలంగాణ ఆవిర్భావం అని కొనియాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సంబంధించి బీజేపీ చేసిన కృషిని బీజేపీ నాయకులు గుర్తు చేసుకున్నారు.అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలు, ఉద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి, ప్రతి యువకుడికి అవకాశాలు లభించాలి వికసిత తెలంగాణ నిర్మాణంలో మనమంతా భాగస్వామ్యం కావాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు ,జిల్లా ప్రధాన కార్యదర్శి లు రవి కుమార్ ఎక్బోటే, శ్యామ్ రావ్ ,పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ నరసింహులు, జిల్లాఓబీసీ నాయకులు దాస్,కౌన్సిలర్ చంద్ర శేఖర్, బిజెపి సీనియర్ నాయకులు అనిల్ మోహన్,నర్సింహశెట్టి, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, మరియు పట్టణ నాయకులు, మండల నాయకులు తదితరులు హాజరయ్యారు.