Listen to this article

జనంన్యూస్. 06. నిజామాబాదు. ప్రతినిధి. మార్చి 9న ఖమ్మం లో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 9వర్ధంతి, 8న రాయల నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ పిండిప్రోలు లో జరుగు సభ లను జయప్రదం చేయండి. సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్.ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా సిద్ధాంతకర్త కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదవ వర్ధంతి .సభ పోస్టర్లను ధర్పల్లి మండల కేంద్రం లొ సిపిఐ ఎంఎల్ మాసు లైన్ గోడ పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా)ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ భారత విప్లవ ఉద్యమంలో 50 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించిన ఘనత కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న)కు ఉందన్నారు. గోదావరి లోయ పరిహాక ప్రాంతంలో లక్షలాది ఎకరాల పోడు భూములను గిరిజనులు గిరిజనేతర పేద ప్రజలకు సాధించడంలో రవన్న పాత్ర క్రియాశీలకమైందని వారన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కరెంటు, రహదారి , విద్య, వైద్యం అభివృద్ధి చెందాలని అనేక ప్రజా పోరాటాలు నిర్వహించడంలో కామ్రేడ్ రవన్న చూపిన మార్గదర్శకం పార్టీకి అమోఘంగా ఉందని వారన్నారు. కామ్రేడ్ రవన్న భారతదేశంలో విప్లవం విజయవంతం కావాలంటే రష్యా తరహా పెట్టుబడిదారీ దేశంగా ఇండియా ఉందని ఈ మారిన పరిస్థితి అనుగుణంగా పార్టీ కార్యక్రమం, పందా, నిబంధవాలిని మార్చుకోవాలని సిద్ధాంతికరించిన గొప్ప నాయకుడని వారు కొని ఆడారు. భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గ పోరాటాలను చేయాలని వారు ఆశించారని, దాని ద్వారానే విప్లవం విజయవంతం అవుతుందని నమ్మిన సిద్ధాంతకర్త అని అన్నారు. కామ్రేడ్ రవన్న తొమ్మిదవ వర్ధంతి వర్ధంతి సభను ఖమ్మం రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మార్చ్ 9 తారీఖున, మార్చి 8వ తారీఖున పిండిప్రోలు గ్రామంలో రాయల నాగేశ్వరావు విగ్రహావిష్కరణ సభను నిర్వహిస్తున్నామని ఈ వర్ధంతి సభకు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. రాయల నాగేశ్వరరావు పెండిపోలు గ్రామ సర్పంచిగా, ఎంపీటీసీగా ప్రజాప్రతినిధిగా గ్రామంలో స్కూలు, కాలేజీ, హాస్పటల్లో, సంత తదితర గ్రామ అభివృద్ధిలో తన జీవితం అంకితం చేసిన ఆదర్శ ప్రజాప్రతినిధి సిపిఐ (ఎంఎల్) ప్రజాపంద నాయకుడిగా ఎంత గుర్తింపు పొందిన నాయకుడని ఇతర దేశాలకు కూడా రాయల నాగేశ్వరావు అంటే ఎంతో గౌరవ అభిమానం అని అలాంటి అమరవీరుల విగ్రహ ఆవిష్కరణ సభలను మార్చి 8 నా పిండిప్రోలు లో జరుగుతుంది విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల నాయకులు ఆశన్న, రాంచందర్, వీలాష్, పోషన్న, కృష్ణ, గంగాధర్, సుమన్, సాయవ్వ, రామాడ్గు సాయవ్వ, లక్ష్మి,తదితరులు
పాల్గొన్నారు.