

జనం న్యూస్ // మార్చ్ // 9 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒడ్డేపెల్లి ఓదెలు బస్సులో ప్రయాణిస్తుండగా హార్ట్ ఎటాక్ రావడంతో అకస్మాత్తుగా మరణించారు.విషయం తెలిసి రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పోతుల నర్సయ్య, ఓదెల కుటుంబ సభ్యులను పరామర్శించి, తక్షణ సహాయం నిమిత్తం మృతుడి పెద్ద కుమార్తె మౌనిక కు 2000 రూపాయలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు, ఈ సందర్భంలో మాజీ సర్పంచ్ పోతుల నర్సయ్య,వెంట మాజీ వార్డ్ మెంబర్ ఒడ్డేపల్లి అరుణ, శ్రీసాయి వికలాంగుల సంక్షేమ సంఘం మండలాద్యక్షులు పైడిమల్ల శ్రీనివాస్ మరియు పలువురు గ్రామస్తులు ఉన్నారు