Listen to this article

జనంన్యూస్. 12. నిజామాబాదు. ప్రతినిధి రైతుల పాలిట శాపంగా మారిన పసుపు రేటు. కాంగ్రెస్. బీజేపీ మధ్య నలిగి పోతున్న తెలంగాణ రైతన్న. సాంగ్లీ మార్కెట్ లో ఉన్న ధరల ప్రకారంగా నిజామాబాద్ రైతుల పసుపు ను కొనుగోలు చేయాలి.. సిండికేట్ గా మారిన పసుపు కొనుగోలు దారులపై చర్యలు తీసుకోవాలి.
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుచేసిన ఉపయోగం సూన్యం కొనుగోలు దారులపై చర్యలు తీసుకుంటే రేపు ఎవరు కొనేది అన్న మార్కెట్ చైర్మన్.అగ్రహించిన రైతులు. సాంగ్లీ మార్కెట్ లో ఉన్న ధరల ప్రకారంగా నిజామాబాద్ రైతుల పసుపు ను కొనుగోలు చేయాలని, సిండికేట్ గా మారిన పసుపు కొనుగోలు దారులపై చర్యలు తీసుకోవాలని ఏ.ఐ.యూ.కే.ఎస్. రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి. ప్రభాకర్.డిమాండ్ చేశారు.
నిజామాబాద్ మార్కెట్ కమిటీ లో పసుపుకు ధరలు రాకుండా కొనుగోలు దారులు సిండికేట్ గా మారి పసుపు రైతులని నిండా మంచుతుంది అన్నారు. సాంగ్లీ తదితర మార్కెట్లో పదిహేను వేల ధర ఉన్న పసుపు నిజామాబాద్ మార్కెట్లో ఎనిమిది తొమ్మిది, వేలు కూడా పలకడం లేదన్నారు. పసుపు పంట తొమ్మిది నెళ్లకు వస్తుందని, పెట్టుబడి 1,70,000 సుమారుగా అవుతుందని అయినా రైతుకు ప్రస్తుతం నిజాంబాద్ మార్కెట్లో ఏమాత్రం ధరలు లేక చేతి ఖర్చులు కూడా వెళ్లడం గగనమైన అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశించిన వ్యవసాయ మార్కెట్ అధికారుల్లో చలనం లేదన్నారు. సిండికేట్ వ్యాపారులకు ఇలాంటి భయం లేకపోవడం వల్ల పసుపు రైతుల్ని అన్ని విధాలుగా దోపిడీ చేస్తున్నారని అన్నారు. సిండికేట్ గా మారిన రైతులపై చర్యలు తీసుకోవాలని అనేక జపాలుగా వినతి పత్రాలు అందజేసిన వారిపై ఎలాంటి చర్య లేకపోవడంతో పసుపు రైతులని దోపిడీ చేయడంలో బరితెగించి వ్యవహరిస్తున్నారు. పసుపు పంటకు మార్కెట్లో ధరలు లేక రైతులు రోజుల తరబడి పని కాపులు కాస్తున్నారు. ఇనాం పద్ధతిలో కోడ్ చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. చినుకులు వ్యాపారులు ఆన్లైన్ పద్ధతి అయినా ఇనాం ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సిండికేట్ గా వ్యవహరిస్తున్నారు. బయట రాష్ట్రాల కొనుగోలుదారులను కోడ్ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పాత పద్ధతి అయిన అర్రాస్ (బహిరంగ వేలం ) వల్ల రైతులకు ఎంతో ఉపయోగమన్నారు. పసుపుకు మార్కెట్లో మధు ధర 15వేలు ఇవ్వాలి అని, ప్రభుత్వం పసుపు క్వింటల్ కు వేయి బోనస్ ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ఆగ్రహం. కొనుగోలు దారులపై చర్యలు తీసుకోవాలి అని రైతులు డిమాండ్ చేయగా చర్యలు తీసుకుంటే రేపు ఎవరు కొనేది అన్న మార్కెట్ చైర్మన్ అనడం తో రైతులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన మద్దత్తు ధరలు లేక రైతులకు ఉపయోగం సూన్యం .తప్ప ఎం లేదు అన్నారు. కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు మంథని గంగారం(పిట్టే), జక్కా. లింగారెడ్డి,స్వామి యాదవ్ సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, జిల్లా నాయకులు బి. దేవారం, ఎస్. సురేష్, జీ. కిషన్, డివిజన్, మండల నాయకులు ఆర్. దామోదర్, బి.బాబన్న, బి. కిషన్, జి.సాయిరెడ్డి, బి. కిశోర్, ఎం. డి. అనిస్, పుట్టి. నాగన్న, టి. కృష్ణ గౌడ్. తదితరులు పాల్గొన్నారు.