

జనం న్యూస్ 17మార్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల కేంద్రంలోనీ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం రోజున పాల్గొన్నారు.ఈ సందర్భంగా 28 లక్షల 88 వేల 5 వందల రూపాయల విలువగల 88 చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సంధర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకులు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి అప్పుల రాష్ట్రంగా మాకుఅప్పగించడంజరిగిందని,అయినప్పటికీ ఉన్న అప్పులను తీరుస్తూ సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుంది అని చెప్పారు.సాగు చేసుకున్న రైతుకు భరోసా ఇచ్చే విధంగా రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని,రైతులకు ఇప్పటికే 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేయడం జరిగిందని,ఇంకా ఎవరికైనా రుణమాఫీ కానీ వారు ఉంటే వారికి రుణాలను మాఫీ చేస్తామని,ఇందిరమ్మ ఇండ్లను కూడా గ్రామ సభ నిర్వహించి అర్హులైన లబ్ధదారులకు పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.