

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సైబరు నేరాలను నియంత్రించేందుకు, ఆయా కేసుల్లో దర్యాప్తు చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని
మెరుగుపర్చుకోవాలని వివిధ పోలీసు స్టేషన్లులో కంప్యూటరు ఆపరేటర్లగా పని చేస్తున్న కానిస్టేబుళ్ళుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మార్చి 19న పిలుపునిచ్చారు. సైబరు నేరాల్లో దర్యాప్తు చేపట్టుటే లక్ష్యంగా కంప్యూటరు పరిజ్ఞానంను మరింత మెరుగు పర్చేందుకు పోలీసు కానిస్టేబుళ్ళుకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – రాబోయే రోజుల్లో సైబరు నేరాలు, మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ తరహా నేరాలను నియంత్రించుట లేదా నమోదైన కేసుల్లో దర్యాప్తు చేపట్టుటకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతీ పోలీసు అధికారి మెరుగుపర్చుకోవాలన్నారు. ఎవరైతే సైబరు నేరాలను చేధించుటలో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తారో తప్పనిసరిగా వారికి పోలీసుశాఖలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందన్నారు. కావున, ప్రతీ పోలీసు ఉద్యోగి సైబరు నేరాలను చేధించుటలకు అవసరమైన పరిజ్ఞానాన్ని, సాంకేతికతను, నైపుణ్యాన్ని ప్రత్యేక శ్రద్ధతో మెరుగుపర్చుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొంటే సాధారణ నేరాల్లో మాదిరిగానే సైబరు నేరాలను కూడా చేధించవచ్చున్నారు. సైబరు నేరం జరిగిన వెంటనే బాధితులు
1930కు ఫిర్యాదు చేసే విధంగా చూడాలన్నారు. ఫిర్యాదు అంశాలను ముందుగా పరిశీలించి, అది ఏ తరహా నేరమో గుర్తించాలన్నారు. నేరం జరిగిన తీరును తెలుసుకొని, బాధితులను విచారణ చేసిన తరువాత, నేరంకు సంబంధించిన ఆధారాలను, డాక్యుమెంట్లును తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బాధితుడి బ్యాంకు స్టేటుమెంటును పరిశీలించి, నేరంకు పాల్పడిన మోసగాడి బ్యాంకు అకౌంటుకు నగదు ఏవిధంగా బదిలీ అయ్యింది, అక్కడ నుండి ఇంకేమైనా అకౌంట్స్కు నగదు బదిలీ జరిగిందా? లేదా? అన్న విషయాలను గుర్తించాలన్నారు. ఇలా గుర్తించిన బ్యాంకు లావాదేవీలను ఫ్రీజ్ చేసేందుకు సంబంధిత విభాగాలకు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలన్నారు. నేరం జరిగిన గోల్డెన్ అవర్స్ లో ఫిర్యాది 1930కు రిపోర్టు చేస్తే, సైబరు మోసగాడి బ్యాంకు లావాదేవీలను నియంత్రించేందుకు ఉత్తర. ప్రత్యుతర్తరాలు సకాలంలో జరిపితే కోల్పోయిన నగదును తిరిగి బాధితుడికి ఇప్పించే అవకాశం ఉంటుందన్నారు. కావున, సైబరు నేరం జరిగిన వెంటనే స్పందించి, 1930కు లేదా https://cybercrime.gov.in సకాలంలో బాధితులు ఫిర్యాదు చేసే విధంగా చూడాలని శిక్షణకు వచ్చిన కానిస్టేబుళ్ళుకు జిల్లా ఎస్పీ సూచించారు. అదే విధంగా మొబైల్స్ పోగొట్టుకున్నామని పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదులపట్ల కూడా సానుకూలంగా వ్యవహరించాలన్నారు. వారు ఇచ్చే ఫిర్యాదులను గూగుల్ ఫారంలో పూర్తి చేసి, సైబర్ సెల్ కి పంపాలని వివిధ పోలీసు స్టేషన్లు నుండి వచ్చిన కంప్యూటరు ఆపరేటర్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సైబరు అండ్ సోషల్ మీడియా సెల్ సిఐ బి.శ్రీనివాసరావు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, కంప్యూటరు నిపుణులు రామరాజు, కే.ప్రసాద్, జగదీష్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.