

జనం న్యూస్ 2025 జనవరి 14(మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మెదక్ పట్టణంలో 9 మొబైల్ రికవరీ చేసిన వాటిని బాధితులకు పట్టణ సి ఐ నాగరాజు అందజేశారు . మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ సి ఐ నాగరాజు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిదిలో 9 మొబైల్స్ ను రికవరీ చేసి బాధితులకు అందచేయడం జరిగిందన్నారు.ఫోన్ పోగొట్టుకొన్న వ్యక్తులు పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా ఫోన్ నెంబర్ ను మరియు ఐ ఎం ఈ ఐ నంబర్ ను సి ఇ ఐ ఆర్ పోర్టల్ నందు అప్లోడ్ చేయడం జరిగిందని .ఈ రోజున దొరికిన మొబైల్స్ వద్ద వారి నుండి రికవరీ చేసి సంబంధిత భాదితులకు అప్పగించడం జరిగిందన్నారు.ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే, దొంగతనంగా ఎత్తుకొని పోయిన వారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సి ఐ ఆర్ పి (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, పోగొట్టుకున్న వ్యక్తులకు పోలీసుస్టేషన్ లో పోలీసు అధికారిని ఈ సి ఈ ఐ ఆర్ పోర్టల్ కి భాద్యతాదికారి గా నియమించడం జరిగిoదని, అతనిని పోలీసు స్టేషన్ కు వెల్లి సంప్రదించిన అతను సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో నిక్షిప్తం చేస్తారని తద్వారా కోల్పోయిన ఫోన్ ను తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మరియు ఎవరన్నా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మితే కొనవద్దని సూచించారు. మొబైల్ పోయినచో ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసి ఆ రిసిప్ట్ ను పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని తెలిపారు.మొబైల్స్ ను రికవరీ చేయడం లో కృషి చేసిన సిబ్బంది కి సి ఐ నాగరాజు అభినందించారు. అదేవిధంగా ఫోను పోగొట్టుకున్న భాదితులు వాటిని రికవరీ చేసి అందించినందుకు పోలీస్ సిబ్బందికి,పోలీస్ కానిస్టేబుల్ మౌనిక కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.