

జనం న్యూస్ // ఏప్రిల్ // 11 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
ప్రతినిత్యం ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు ఇప్పటివరకు న్యాయం చేసే వేదిక లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని వీటి పరిష్కారం కోసం ఆవిర్భవించే వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా అని రాష్ట్ర కార్యదర్శి తాడూరి కర్ణాకర్ అన్నారు. శుక్రవారం ఆ సంఘం జమ్మికుంట ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏర్పడ్డ సందర్భంగా. జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. గ్రామీణ ప్రాంత జర్నలిస్టులు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ నాటి జర్నలిస్టుల సంఘాల నాయకుల నిర్వాహకమే కారణమని వారి లబ్ధి కోసం పాలకుల ప్రాపకం కోసం అసంఖ్యాక విలేకరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తదనంతరం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా జమ్మికుంట ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. డబ్ల్యూ జే ఐ జమ్మికుంట మండల అధ్యక్షులుగా అంబాల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా ఐత రాధాకృష్ణ, కోశాధికారి మోరే ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా నర్సిని సతీష్, మధ్యర్ల కుమారస్వామి, సహాయ కార్యదర్శిగా, నేదురి సమ్మయ్య, పసునూటి శ్రీకాంత్, మరియు కొంగల కుమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యులుగా, దాట్ల శ్రీనివాస్, ఇ, రాజు, దేవేందర్, టి, రవి కే,విజయ్, సుజాత, శ్రీనివాస్, ఎన్ శంకర్ లు నియామకం అయ్యారు.
