Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం

భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలోని పుష్ప కన్వెన్షన్ హాలో ఈ నెల 23 న ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో నిరుద్యోగులు యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై జక్కుల పరమేష్ తెలియజేశారు మండల పరిధిలోని రైతు భవనంలో శాయంపేట మండల గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారాలతో పాటు కార్యదర్శులు ఐ కె పి సి సిలకు ఆశ వర్కర్లకు ఫీల్డ్ అసిస్టెంట్లకు అంగన్వాడీ టీచర్లకు స్థానిక ఎంపిడిఓ ఫణి చంద్ర ఆధ్వర్యంలో జాబ్ మేళా పై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై జక్కుల పరమేష్ పాల్గొని మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో సుమారుగా 100 కంపెనీలకు సంబంధించిన అధికారులు పాల్గొంటారని జాబ్ మేళాలో మేళాలో నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనె అవకాశాలను పొందాలని కోరారు మండలం లోని అన్ని గ్రామాల ప్రత్యేక అధికారాలు పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామంలో ఉండే యువతీ యువకులు జాబ్ మేళా కు వెళ్లే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు జాబ్ మేళా కు వెళ్ళే యువతీ యువకులు జాబ్ మేళా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో క్యూఆర్ కోడ్ తీసుకుని స్కానింగ్ చేసుకోవాలని తెలిపారు వెళ్ళే అభ్యర్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పరకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావు మండలం ప్రత్యేక అధికారి విద్యాలత ఏవో గంగ జమున మండలం లోని అన్ని గ్రామాల ప్రత్యేక అధికారాలు ఐ కె పి సి సి పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు అసిస్టెంట్లు పాల్గొన్నారు….